Hedayat “A fruitful harvest”
from the gardens of “ Verses and Hadiths ”
Inspiring Dawah cards that highlight the profound meanings of Quranic verses and Prophetic Hadiths. Presented in an accessible and engaging style to help Muslims gain a deeper understanding of their faith with ease.
About Hedayat
Hedayat is a platform that combines simplicity of design and ease of use
displaying the benefits derived from Verses and Hadiths in
attractive cards with unique designs.
Unique Designs
Cards with unique and attractive designs that express the content of the text
Reliable Materials
Scientifically reliable benefits reviewed by a group of scholars
Easy Browsing
You can browse the cards easily and display them effortlessly
Different Languages
Cards are available in more than 40 languages for the benefit of all
Hadith Cards
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రతి రాత్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అరచేతులను దగ్గరకు చేర్చి, వాటిలో ఊది, అల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్, అన్’నాస్ సూరాలను (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను) పఠించి, ఆ రెండు అరచేతులతో వీలైనంత మేర శరీర భాగాలను తుడుచుకునే వారు. తన తల, ముఖము, మరియు శరీరపు ముందు భాగము నుండి ప్రారంభించేవారు. అలా మూడు సార్లు చేసేవారు”.
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారుఇది (ఉమ్మత్) కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కానుక. ఆయన రాత్రి నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అర చేతులను, దువా చేయునపుడు దగ్గరికి చేర్చిన విధంగా దగ్గరకు చేర్చి, వాటిని కొద్దిగా పైకి ఎత్తి, వాటిలో తన నోటి నుండి కొద్దిగా తుంపరలు పడునట్లుగా నెమ్మదిగా ఊదేవారు. తరువాత మూడు సూరాలు (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను) పఠించి, తరువాత ఆ రెండు అరచేతులతో తన శరీరాన్ని అందినంత మేర తుడిచేవారు. తన తల, ముఖము మరియు శరీరపు ముందు భాగమునుండి మొదలు పెట్టే వారు. అలా మూడు సార్లు చేసేవారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా విన్నానని అన్నారు :- “సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది.” (తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:) “(నమాజులో) దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించినాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచినాడు”; ఆయన ఇంకా ఇలా అంటాడు: “నా దాసుడు తన వ్యవహారాలన్నింటినీ నాకు అప్పగించినాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నాదాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారుఈ హదీసుల్ ఖుద్సీలో అల్లాహ్ ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినారు: ‘నేను సూరతుల్ ఫాతిహాను నాకు మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను, అందులో ఒక సగభాగము నా కొరకు, మరియు మరొక సగభాగము అతని కొరకు.” మొదటి సగభాగము: అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించుట, ఆయనను మహిమపరుచుట. అందుకొరకు నేను అతనికి ప్రతిఫలములలో శుభప్రదమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. రెండవ సగభాగము: దుఆ అంటే మొరపెట్టుకొనుట. నేను అతని మొరను ఆలకిస్తాను మరియు అతడు అర్థించిన దానిని ప్రసాదిస్తాను. సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి “అల్’హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు అల్లాహ్ “నా దాసుడు నన్ను కీర్తించినాడు” అని అంటాడు; ”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు, మరియు సృష్ఠి మొత్తంపై ఉన్న నా అనుగ్రహాన్ని, కరుణను అతడు గుర్తించినాడు” అని అంటాడు; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, అల్లాహ్ “నా దాసుడు నన్ను కొనియాడినాడు, మరియు అది ఒక గొప్ప గౌరవం” అంటాడు. దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, అల్లాహ్ “ఇది నాకు, నా దాసునికి మధ్యనున్న విషయం” అంటాడు. ఈ ఆయతులో మొదటి సగభాగము (ఇయ్యాక న’బుదు – ‘మేము కేవలం నిన్నే (నిన్ను మాత్రమే) ఆరాధిస్తాము’) అల్లాహ్ కు చెందినది. ఇందులో ‘అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు నిజమైన అర్హుడు’ అనే దాసుని ఒప్పుకోలు, మరియు దానికి జవాబుగా అతడు అల్లాహ్ ను ఆరాధించుట ఉన్నాయి – దానితో (సూరతుల్ ఫాతిహాలో) అల్లాహ్ కు చెందిన మొదటి సగభాము ముగుస్తుంది. ఈ ఆయతులో రెండవ సగభాగము – అది దాసునికి చెందినది: (ఇయ్యాక నస్తఈన్) ఇందులో అల్లాహ్ నుండి సహాయం కొరకు అర్థింపు ఉన్నది. మరియు అది అతనికి ప్రమాణం చేయబడింది. దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం*, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు: “ఇది నా దాసుని దుఆ మరియు అతడు నాకు పెట్టుకునే మొర. అతడు అర్థించినది అతనికి ప్రసాదించబడుతుంది, మరియు నిశ్చయంగా అతడు అర్థించిన దానిని నేను ప్రసాదించాను.”
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది. అపుడు పిలుపునిచ్చు వాడొకడు ఎలుగెత్తి “ఓ స్వర్గవాసులారా!” అని పిలుపునిస్తాడు. అపుడు వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు తిరిగి పిలుపు ఇవ్వబడుతుంది “ఓ నరకవాసులారా!”. దానితో వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు దానిని (గొర్రెపోతు రూపములో ఉన్న మృత్యువును) జిబహ్ చేయుట జరుగుతుంది. అపుడు ఆ పిలిచేవాడు ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! మీకు ఇది (స్వర్గము) శాశ్వతము, మరియు (మీకు) మృత్యువు లేదు; ఓ నరకవాసులారా! మీకు ఇది (నరకము) శాశ్వతము, మరియు మీకు మృత్యువు లేదు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు “ {وَأَنْذِرْهُمْ يَوْمَ الحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ} (సూరహ్ మర్యం:39) (మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు....”) అని ఇంతవరకు పఠించి “(అవును) ఈ ప్రాపంచిక జీవితములో పడి కొట్టుకు పోతున్నవారు ఏమరపాటులో పడి ఉన్నారు” అన్నారు. తరువాత ఆ ఆయతు చివరి భాగము (وَهُمْ لاَ يُؤْمِنُونَ) (కావున వారు విశ్వసించడం లేదు) (సూరహ్ మర్యం:39) పఠించి పూర్తి చేసినారు.
ముత్తఫిఖ్ అలైహిఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తీర్పు దినము నాడు మృత్యువు ఒక గొర్రెపోతు రూపములో ముందుకు తీసుకు రాబడుతుంది అని, అది నలుపు, తెలుపు రంగులలో ఉంటుంది – అని తెలియ జేస్తున్నారు. అపుడు “ఓ స్వర్గవాసులారా!” అను ఎలుగెత్తి పిలువ బడుతుంది. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. (ఆ పిలిచిన వాడు మృత్యువును చూపిస్తూ) “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు ఆ పిలిచేవాడు “ఓ నరకవాసులారా!” అని పిలుస్తాడు. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు దానిని (మృత్యువును) జిబహ్ చేయడం జరుగుతుంది. ఆ పిలిచేవాడు ఎలుగెత్తి ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! ఇది (ఈ స్వర్గ నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు; “ఓ నరకవాసులారా! ఇది (ఈ నరక నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు”. ఇది స్వర్గ నివాసుల శుభాలలో (అల్లాహ్ తరఫు నుండి) అపారమైన వృద్ధి, అలాగే నరకవాసుల శిక్షలో అపారమైన కాఠిన్యాన్ని గురించి తెలుపు తున్నది. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ నుండి ఆయతును పఠించినారు. “మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు”. ఈ హదీసు ద్వారా – తీర్పు దినము నాడు (ప్రజలు వారి వారి కర్మలను అనుసరించి) స్వర్గవాసులు, నరకవాసులుగా విభజించబడతారు. ప్రతి ఒక్కరూ తమకు ప్రాప్తమైన దాని లోనికి శాశ్వతంగా ప్రవేశిస్తారు. (ఆ దినము) పాపకార్యములు చేసిన వాడు (తాను ఆ కార్యములకు పాల్బడకుండ ఉంటే ఎంత బాగుండును) అని పశ్చాత్తాప పడతాడు, సిగ్గు పడతాడు, కానీ అది ఏమీ అతనికి మంచిని కలుగ జేయదు, అతని శిక్షను ఏమీ తగ్గించదు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.
ముత్తఫిఖ్ అలైహిరసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు:{ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు:''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞాన వంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఇందులో అల్లాహ్ సుబ్’హానహూ వ త’ఆలా తానే తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దివ్య ఖుర్’ఆన్ ను అవతరింపజేసినాను అని అంటున్నాడు; అందులో విస్పష్టమైన ఆయతులు ఉన్నాయని, వాటిలోని ఆదేశాలు, మరియు నిబంధనలలో ఎటువంటి అస్పష్టత లేనివి అని అంటున్నాడు. అవి దివ్య గ్రంథానికి పునాది వంటివి, మరియు నిర్దేశకాల (reference) వంటివి (దిశా నిర్దేశము చేయునటువంటివి). ఆయతుల మధ్య అనంగీకార సందర్భాలలో ఇవి (సరియైన అర్థం వైపునకు) దిశా నిర్దేశము చేస్తాయి. అదే విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని కొన్ని ఆయతులు ఒకటి కంటే ఎక్కువ అర్థాలనిచ్చే సంభావ్యత కలిగినవి ఉన్నాయి. కనుక అవి కొంతమంది ప్రజలను (వెంటనే అర్థం కాక) అస్పష్టతకు గురి చేయవచ్చు, లేక ఈ ఆయతుల మధ్య మరియు ఇతర ఆయతుల మధ్య సమన్వయం లేదు అనిపించవచ్చు. అటువంటి ఆయతుల పట్ల ప్రజలు ఏవిధంగా వ్యవహరిస్తారో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అటువంటి ఆయతుల సరియైన అర్థాన్ని తెలుసుకునే క్రమంలో కొందరు, పునాదుల వంటి ఆయతులను (సంప్రదించకుండా) వదిలి వేస్తారు. తమ అవగాహనకు దగ్గరగా ఉన్న అర్థాన్ని తీసుకుంటారు. ఆ విధంగా ప్రజలలో సందేహాలను రేకెత్తిస్తారు, వారిని అపమార్గం పట్టిస్తారు. అలాగే ఎవరైతే తమ ఙ్ఞానములో స్థిరంగా ఉంటారో, వారు ఈ (ఒకటి కంటే ఎక్కువ అర్థాలను ఇచ్చే) ఆయతులను గురించి ఎరుగుదురు. వారు పునాదుల వంటి ఆయతుల దిశా నిర్దేశములో వాటి అర్థాన్ని గ్రహిస్తారు, మరియు వాటిలో అస్పష్టతగానీ, సమన్వయలోపం గానే ఏమీ లేదని, అవి సర్వ శక్తిమంతుడూ, సర్వోత్కృష్టుడూ అయిన అల్లాహ్ తరఫునుండి అని విశ్వసిస్తారు. అయితే స్వాస్థ్యమేధస్సు గలవారు మాత్రమే దాని నుండి గ్రహిస్తారు మరియు నేర్చుకుంటారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల మాత (ఉమ్ముల్ మోమినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా తో ఒకవేళ తను ఆ విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని అస్పష్టమైన ఆయతుల వెంట పడేవారిని గనుక చూసినట్లైతే, వారిని గురించి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు) అని, వారితో జాగ్రత్తగా ఉండమని అన్నారు, వారు చెప్పేది విన వద్దు అని అన్నారు.
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో”.
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: విశ్వాసులలో ఉత్తములు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానములు పొందు వారు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో (బోధిస్తారో) – అంటే, ఖుర్ఆన్ ను, దానిని పఠించే నియమాలను అనుసరించి పఠించడాన్ని, పఠించిన దానిని కంఠస్థము చేయడాన్ని, ఖుర్ఆన్ ను భావయుక్తంగా, మధురంగా పఠించడాన్ని, మరియు అందులోని ఆదేశాలను అవగాహన చేసుకోవడాన్ని, అలాగే దాని విశ్లేషణను నేర్చుకుంటాడో - అలాగే తాను నేర్చుకున్న ఖుర్ఆన్ శాస్త్రాలలో ఉన్న ఙ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తాడో, అలాగే ఆ ఙ్ఞానము ప్రకారము ఆచరిస్తూ ఉంటాడో – అటువంటి వాడు ఉత్తముడు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానమును పొందువాడు అవుతాడు.
అబూ మస్’ఊద్ అల్ బద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.”
ముత్తఫిఖ్ అలైహిఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే రాత్రి (నిద్రించడాని ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క ఆఖరి రెండు ఆయతులు పఠిస్తాడో, అల్లాహ్ అతనికి కీడు నుంచి, మరియు అయిష్టమైన ప్రతి విషయము నుంచి సరిపోయేలా (రక్షణ) చేస్తాడు, అని తెలియజేస్తున్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ కొంతమంది ఉలమా ఇలా అభిప్రాయపడ్డారు “సరిపోయేలా చేస్తాడు అంటే – ఆ రెండు ఆయతులను అతని రాత్రి నమాజు (తహజ్జుద్) కు సరిపోయేలా చేస్తాడు”; మరి కొంతమంది ఉలమా “(ఆరాత్రి అతడు చేయ దలచిన) ఇతర రకాల ఆరాధనలకు సరిపోయేలా చేస్తాడు అని అర్థము” అన్నారు; మరికొంతమంది ఉలమా “ఆ రెండు ఆయతులు, రాత్రి నమాజు కొరకు (ఖియాముల్లైల్) తక్కువలో తక్కువగా సరిపోయే ఆయతులు” అన్నారు. ఇంకా వేర్వేరు అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే, గమనించవలసిన విషయం ఏమిటంటే పైన తెలుపబడిన అభిప్రాయాలు అన్నీ కూడా సరియైనవే, విలువైనవే, ఎందుకంటే ఆ వాక్యము (సరిపోయేలా చేస్తాడు) పరిధిలోనికి ఇవన్నీ కూడా వస్తాయి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది. (కనుక) “అలిఫ్, లామ్, మీమ్” ను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.” (అంటే దివ్య ఖుర్’ఆన్ గ్రంథము నుండి ఎవరైనా “అలిఫ్, లామ్, మీమ్” అని పఠిస్తే వారికి ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయిఅని అర్థము).
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరమైనా పఠించిన ప్రతి ముస్లిం ఒక (సత్కార్యాన్ని చేసిన) పుణ్యాన్ని పొందుతాడు, అంతేగాక అతనికి లభించిన ఆ ప్రతిఫలం పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది – అని తెలియజేస్తున్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ఇలా వివరించినారు (“అలిఫ్, లామ్, మీమ్” లను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.”) “అంటే ఇవి మూడు అక్షరాలు, వీటిలో ముప్ఫై పుణ్యాలున్నాయి”.
అబీ అబ్దుర్రహ్మాన్ అస్’సులమీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో, ఎవరైతే మాకు ఖుర్’ఆన్ పారాయణము చేసినారో (ఎవరి వద్దనైతే మేము ఖుర్’ఆన్ నేర్చుకున్నామో) – వారు మాతో ఇలా పలికినారు – తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు. వారు ఇంకా ఇలా అన్నారు – “ఆ విధంగా మేము ఙ్ఞానాన్ని, మరియు దాని అన్వయాన్ని కూడా నేర్చుకున్నాము”.
దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారుఈ హదీసు ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు వారి నుండి ఖుర్’ఆన్ లోని పది ఆయతులను గ్రహించేవారు. ఆ పది ఆయతులలో ఉన్న ఙ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించేటంత వరకు, దానిని ఆచరణలోనికి తెచ్చేటంత వరకు మరో పది ఆయతుల వైపుకు వెళ్ళేవారు కాదు. ఆ విధంగా వారు ఙ్ఞానాన్ని మరియు ఆచరణను కూడా సాధించినారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇళ్ళలో నమాజు ఆచరించకుండా ఉండుటను, తద్వారా ఇళ్ళు స్మశానాల మాదిరిగా మారుటను నిషేధించినారు, ఎందుకంటే స్మశానలలో నమాజులు ఆచరించబడవు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటి నుండి షైతాను పారిపోతాడు అని అన్నారు.
అబుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) అనే ఆయతు అవతరించనంత వరకు సూరాలు (దివ్య ఖుర్’ఆన్ లోని అధ్యాయాలు) ఎక్కడ అంతమవుతాయనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎరుగరు.
దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారుఈ హదీసులో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా వివరిస్తున్నారు: దివ్య ఖుర్’ఆన్ లోని సూరాలు (అధ్యాయాలు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడినాయి. అయితే అవతరణ జరుగుతున్నపుడు అవి ఎక్కడ వేరవుతాయి, వాటి చివరలు ఏమిటీ అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియదు. ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ అవతరిస్తే అపుడు వారికి తెలిసేది అంతకు ముందు సూరా ముగిసినది అని, కొత్త సూరహ్ ప్రారంభమైనది అని.